నేడు జిల్లాలో లోకేష్ పర్యటన
ABN , First Publish Date - 2020-12-05T05:38:33+05:30 IST
జిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా పొన్నూరు, బాపట్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాలో దెబ్బతిన్న పంటలను చూసి రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు పొన్నూరు నియోజకవర్గంలోని పచ్చల తాడిపర్రు గ్రామం నుంచి యాత్ర మొదలవుతుందన్నారు. 10.30కు బాపట్ల నియోజకవర్గం ఈతేరు, 12.45కు పర్చూరు నియోజకవర్గం, మధ్యాహ్నం 3.45 సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి లోకేష్ చేరుకొని రైతులతో మాట్లాడనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.