ఏకాంతంగానే అప్పన్న తెప్పోత్సవం
ABN , First Publish Date - 2022-01-29T05:37:40+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక ఉత్సవాలలో భాగమైన తెప్ప తిరునాళ్ల ఉత్సవం ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. సింహగిరిపై స్వామివారి ఆలయ సమీపంలోని కొలనులో ఉత్సవాన్ని ఏకాంతసేవగా నిర్వహించనున్నామని ఈఓ ఎంవీ సూర్యకళ ప్రకటించారు.
ఫిబ్రవరి 1న సాయంత్రం 6 గంటల వరకే స్వామి దర్శనం
సింహాచలం, జనవరి 28: వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక ఉత్సవాలలో భాగమైన తెప్ప తిరునాళ్ల ఉత్సవం ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. సింహగిరిపై స్వామివారి ఆలయ సమీపంలోని కొలనులో ఉత్సవాన్ని ఏకాంతసేవగా నిర్వహించనున్నామని ఈఓ ఎంవీ సూర్యకళ ప్రకటించారు. ఏటా పుష్యమాస బహుళ అమావాస్యనాడు కొండదిగువ వరాహపుష్కరిణిలో తెప్పోత్సవం కోలాహలంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాన్ని ఏకాంత సేవగా, పరిమిత సిబ్బందితో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1న భక్తుల కు సింహాద్రినాథుని దర్శనాలు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని, తిరిగి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు యధావిధిగా దర్శనాలకు అనుమతిస్తారు.