పొడవైన రోడ్‌ టన్నెల్‌!

ABN , First Publish Date - 2021-09-30T05:30:00+05:30 IST

శ్రీనగర్‌-లేహ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌లో ఎన్నో

పొడవైన రోడ్‌ టన్నెల్‌!

శ్రీనగర్‌-లేహ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌లో ఎన్నో ప్రత్యేకతలునాయి. సోనామార్గ్‌, కార్గిల్‌ మధ్యన ఉన్న జోజిలా ఘాట్స్‌లో దీన్ని నిర్మిస్తున్నారు. సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తులో, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య 14.2 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం జరుగుతోంది. 


 ఇండియాలో పొడవైన రోడ్‌ టన్నెల్‌ ఇది. అంతేకాదు ఆసియాలో పొడవైన బై-డైరెక్షనల్‌ టన్నెల్‌ కూడా! 


 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో రెండు వరుసల్లో టన్నెల్‌ నిర్మాణం జరుగుతోంది.


 ఈ టన్నెల్‌ అందుబాటులోకి వస్తే ఏడాది పొడవునా శ్రీనగర్‌, లడఖ్‌ మధ్య ప్రయాణానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చలికాలంలో తీవ్రమైన మంచు కారణంగా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది. 


 ఈ టన్నెల్‌ వల్ల రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని బాల్టల్‌, మినామార్గ్‌ల మధ్య దూరం 40 కి.మీల నుంచి 13 కి.మీలకు తగ్గనుంది. 


Updated Date - 2021-09-30T05:30:00+05:30 IST