నెట్‌ఫ్లిక్స్ షోపై హోం మంత్రి సీరియస్.. పోలీసులను పిలిచి..

ABN , First Publish Date - 2020-11-23T03:18:30+05:30 IST

నెట్‌ఫ్లిక్స్‌ షో ‘ఏ సూటబుల్ బాయ్’పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా సీరియస్ అయ్యారు. వెంటనే ఈ విషయంపై...

నెట్‌ఫ్లిక్స్ షోపై హోం మంత్రి సీరియస్.. పోలీసులను పిలిచి..

భోపాల్: నెట్‌ఫ్లిక్స్‌ షో ‘ఏ సూటబుల్ బాయ్’పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా సీరియస్ అయ్యారు. వెంటనే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఏ సూటబుల్ బాయ్ షో నెట్‌ఫ్లిక్స్‌లో 6 భాగాలుగా విడుదలవుతోంది. అక్టోబరు 23న తొలి భాగం ప్రసారమైంది. అయితే ఈ షోలో ఒక వర్గం ప్రజలకు తీవ్ర అభ్యంతరం కలిగించే సన్నివేశాలు ఉన్నాయంటూ అప్పట్లోనే బీజేపీ నేత గౌరవ్ గోయల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు కూడా వేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నరోత్తం మిశ్రా కూడా ఈ షోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అందులో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో కూడా పంచుకున్నారు.



Updated Date - 2020-11-23T03:18:30+05:30 IST