ముంబైలో మరిన్ని ఆంక్షలు?

ABN , First Publish Date - 2021-04-10T21:29:04+05:30 IST

కరోనా వైరస్ ధాటికి ముంబై మహా నగరం విలవిలలాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యల కేసులు నమోదవుతుండడంతో వణికిపోతోంది

ముంబైలో మరిన్ని ఆంక్షలు?

కరోనా వైరస్ ధాటికి ముంబై మహా నగరం విలవిలలాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యల కేసులు నమోదవుతుండడంతో వణికిపోతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారంతపు లాక్‌డౌన్ విధించింది. శుక్రవారం రాత్రి నుంచి ఈ వీకెండ్ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో శనివారం ఉదయం ముంబై మహానగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. 


మహారాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేడు (శనివారం) అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అఖిల పక్షంలో సీఎం చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం పలు నిర్ణయాలు వెల్లడించే అవకాశముంది.  

Updated Date - 2021-04-10T21:29:04+05:30 IST