పోలీసు బలగాల్లో 5,713 మందికి కరోనా పాజిటివ్.... 71 మంది మృతి!
ABN , First Publish Date - 2020-07-09T12:50:53+05:30 IST
మహారాష్ట్రలో కొత్తగా మరో 278 మంది పోలీసులకు కోవిడ్ -19 సోకినట్లు తేలింది. దీంతో మొత్తంగా పోలీసు బలగాలలో కరోనా సోకిన సిబ్బంది సంఖ్య 5,713కు చేరుకుంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా...
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా మరో 278 మంది పోలీసులకు కోవిడ్ -19 సోకినట్లు తేలింది. దీంతో మొత్తంగా పోలీసు బలగాలలో కరోనా సోకిన సిబ్బంది సంఖ్య 5,713కు చేరుకుంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఇప్పటివరకు 71 మంది పోలీసులు మృతిచెందినట్లు ఒక అధికారి తెలిపారు. ముంబైలో గరిష్టంగా 43 మంది పోలీసులు మరణించారని పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు 4,531 మంది పోలీసులు ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,113 మంది పోలీసులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా, మార్చి 25 నుంచి అంటే లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిషేధిత ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు మొత్తం 1,55,984 కేసులను నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. అలాగే 88,783 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, రూ .11.54 కోట్లు జరిమానా విధించామని పేర్కొన్నారు.