ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు Diwali బోనస్

ABN , First Publish Date - 2021-10-30T18:37:49+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది...

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు Diwali బోనస్

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రకటన

ముంబై : దీపావళి పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు  ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది. దీపావళ్లి సందర్భంగా బోనస్ ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తాజాగా ప్రకటించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు  ఉద్యోగులకు 20వేలరూపాయల చొప్పున,పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి రూ.10వేలు, ఆరోగ్య కార్యకర్తలకు5,300 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 


గత సంవత్సరం మహా సర్కారు మున్సిపల్ ఉద్యోగులకు 15,500 రూపాయల బోనస్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 227 మంది సభ్యుల్లో 97 స్థానాలు శివసేనవి. బీజేపీ 83 కార్పొరేటర్ స్థానాలు, కాంగ్రెస్ 29, ఎన్సీపీ 8, సమాజ్ వాదీపార్టీ 6, మజ్లిస్ 2, మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒక స్థానాలను దక్కించుకున్నాయి.


Updated Date - 2021-10-30T18:37:49+05:30 IST