పరమ్ బీర్కు జస్టిస్ చండీవాల్ కమిషన్ జరిమానా!
ABN , First Publish Date - 2021-06-23T05:21:36+05:30 IST
మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇవాళ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్కు రూ.5 వేల...
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇవాళ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్కు రూ.5 వేల జరిమానా విధించింది. రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ రావాల్సిందిగా ఆదేశించినప్పటకీ.. ఆయన రాకపోవడంతో కమిషన్ ఈ మేరకు జరిమానా వేసింది. జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇప్పటికి మూడు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సింగ్ విచారణకు హాజరు కాలేదు. మూడోసారి ఆయన తరపున ఓ న్యాయవాది విచారణకు వచ్చారు. దేశ్ముఖ్పై సింగ్ చేసిన సంచలన ఆరోపణలపై దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 30న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చండీవాల్ నేతృత్వంలో కమిషన్ వేసిన విషయం తెలిసిందే.