1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా
ABN , First Publish Date - 2020-08-14T11:32:52+05:30 IST
మహారాష్ట్రలోని జైళ్లలో 1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది....
ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని జైళ్లలో 1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో 814 మంది ఖైదీలు, 268 మంది జైలు ఉద్యోగులు కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. కరోనా సోకిన ఆరుగురు ఖైదీలు మరణించారని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో అత్యధికంగా 66,999 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర జైళ్లలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆయా జైళ్లను శానిటైజ్ చేయడంతోపాటు కరోనా సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.