చాంపియన్ మేఘన మోడరన్స్
ABN , First Publish Date - 2021-01-21T06:41:25+05:30 IST
మహిళల అనంతపురం ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నీలో మేఘన మోడరన్స్ జట్టు చాంపియన్గా అవతరించింది.
అనంతపురం క్లాక్టవర్, జనవరి 20: మహిళల అనంతపురం ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నీలో మేఘన మోడరన్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్తాధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఫైనల్స్ సాగాయి. మొదట బ్యాటింగ్ చేసిన మేఘన మోడరన్స్ నిర్ణీత 25 ఓవర్లలో 145 పరుగులు సాధించింది. నేహ (50), అనూష (71) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన అంజలి ఏంజిల్స్ 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేసి, ఓటమిపాలైంది. దీంతో మేఘన మోడరన్స్ జట్టు విజేతగా నిలిచింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీటీ మహిళా సెక్టార్ డైరెక్టర్ విశాలాఫెర్రర్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో రాణించటం శుభపరిణామమన్నారు. క్రీడారంగంలో మహిళలకు మరింత ప్రాధాన్యత పెరగాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నతస్థానాలకు అధిరోహించాలన్నారు. అనంతరం విజేత జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, జిల్లా క్రికెట్సంఘం అధ్యక్షకార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధు, సహాయ కార్యదర్శి గౌసియాబేగం, మేనేజర్ సురేంద్ర, బాలవంశీ, వార్డెన్ మంజుల, ప్రతిభ, రాజేశ్వరి, కోచ్లు తాహీర్, హరినాథ్రెడ్డి, పీఈటీ మంజుల, ఫణితేజ పాల్గొన్నారు.