విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి
ABN , First Publish Date - 2021-10-24T05:18:31+05:30 IST
విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో బోధన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కోరారు.
రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి
భీమునిపట్నం, అక్టోబరు 23: విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో బోధన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కోరారు. శనివారం ఆయన భీమిలి ప్రభుత్వ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, రికార్డులను ఆయన పరిశీలించారు. భోజన పదార్థాలాను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాప్కిన్స్ పంపిణీపై రికార్డులు అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎండీఎం విశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామరాజు, ఎంఈవో ఎస్ఏ బాలామణి పాల్గొన్నారు.