జాతీయ సభను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-10-18T05:36:35+05:30 IST
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రామగుం డం కార్పొరేషన్ అధ్యక్షులు పల్లెబాపు పిలుపునిచ్చారు.
కళ్యాణ్నగర్, అక్టోబరు 17: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రామగుం డం కార్పొరేషన్ అధ్యక్షులు పల్లెబాపు పిలుపునిచ్చారు. ఆదివారం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్దఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, వారికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా కొంతమంది అడ్డుతగులుతున్నార ని, వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభ సికింద్రాబాద్లోని జీవీఆర్ గార్డెన్స్లో ఈనెల 24న జరుగనున్నట్టు పేర్కొన్నా రు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, అబ్బయ్య నారాయణస్వామి, లోక్నాథ్ మురుగణ్ హాజరవుతారని, రామగుండం నియోజకవర్గం నుం చి పెద్దఎత్తున ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్పీఎస్ నాయకులు కన్నూరి ధర్మేందర్, ఎల్కలపల్లి వెంకన్న, కాసిపేట రాజయ్య, దశరథం, బొంకూరి రమేష్, జనగామ శ్రీనివాస్, అంబాల రాజేందర్, రాసపల్లి రవికుమార్, ఉప్పులేటి పర్వతాలు, మాతంగి కుమార్, స్వామి, అనీల్ కుమార్, వసుంధర, రాజేశ్వరి పాల్గొన్నారు.