మల్లన్న సాగర్ ముంపు బాధితుల వెతలు
ABN , First Publish Date - 2021-08-17T23:09:58+05:30 IST
మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేట: మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ముట్రాజపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో బాధితులు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చిన్నపాటి వర్షాలకే డబుల్ బెడ్రుమ్ ఇళ్లకు పగుళ్లు, పెచ్చులు ఉడుతుండడంతో అష్ట కష్టలు పడుతున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే చౌకధరల దుకాణానికి చెందిన ఇంట్లో కొద్ది రోజులుగా గోడలకు నెర్రలు ఏర్పడటంతో ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు గజ్వేల్లో గత రాత్రి నుంచి అడపదడపా వర్షం పడటంతో ఇంట్లోకి నీళ్లు చేరి చౌకధరల దుకాణంలో ఉండే దాదాపు 10 క్వింటాళ్ల బియ్యం తడిసి ముద్దయింది.పగుళ్లు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను సంబంధిత కాంట్రాక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో మరమ్మతులు చేపట్టారు.