బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ 50 ఏళ్ల వ్యక్తి

ABN , First Publish Date - 2020-10-22T00:17:01+05:30 IST

మహిళలపై అత్యాచారాల గురించి ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయితే తక్కువే అయినా పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతుంటాయి. అత్యాచారం కాదు కానీ బాలుడిపై ఓ వ్యక్తి

బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ 50 ఏళ్ల వ్యక్తి

ముంబై: మహిళలపై అత్యాచారాల గురించి ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయితే తక్కువే అయినా పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతుంటాయి. అత్యాచారం కాదు కానీ బాలుడిపై ఓ వ్యక్తి (50) లైంగిక హింసకు పాల్పడ్డాడు. ముంబైలోని నగపడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిందీ ఘటన. ఈ విషయమై బాలుడు పోలీసులను సంప్రదించాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు పోలీస్ స్టేషన్‌ నుంచి పారిపోయాడు. పోలీసులు డాక్యూమెంట్లు సర్దుతుండగా, అదే అదను చూసి పోలీస్ స్టేషన్ నుంచి పరుగు అందుకున్నాడు. ముందుగానే బుక్ చేసి పెట్టుకున్న క్యాబ్‌ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-10-22T00:17:01+05:30 IST