చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:32:32+05:30 IST
మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఓర్వకల్లు, మే 16: మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కర్నూలు నగరం మారుతినగర్ చెందిన సయ్యద్ ఖాజా మునీర్ (36) శనివారం ద్విచక్రవాహనంపై కర్నూలు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం రాగమయూరి వద్ద ఢీకొనడంతో సయ్యద్ ఖాజా మునీర్కు గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.