వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-14T06:24:47+05:30 IST
శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్ళి ఓ భక్తుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
శ్రీశైలం, ఏపిల్ 13: శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్ళి ఓ భక్తుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం, ఘూకండి జిల్లా, అసంగి గ్రామానికి చెందిన సిరాహట్టి భీమప్ప(38) మంగళవారం పాతాళగంగలో స్నానం కోసం దిగి ఈతరాక మునిగిపోయాడు. అక్కడే ఉండే గజ ఈతగాళ్లు బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తునట్లు తెలిపారు.