అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-24T04:15:59+05:30 IST

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని ఆల్వకొండ గ్రామంలో చోటు చేసుకుంది.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి


సంజామల, జనవరి 23: అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని ఆల్వకొండ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అందనం చిట్టిబాబు (35) అతిగా మద్యం తాగి రెడ్డిపల్లె - ఆల్వకొండ మధ్య ఉన్స ఎస్సార్బీసీ కాలువ సమీపంలో మృతి చెందాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అందనం చిట్టిబాబుకు గత కొంత కాలం క్రితం భార్య మృతి చెందింది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. పె ద్ద కుమార్తెకు వివాహం జరిపించాడు. చిట్టిబాబు హెచఐవీ రోగి కావడంతో మద్యానికి బానిసై అతిగా మద్యం తాగేవాడన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుం చి మద్యం తాగుతూ ఎస్సార్బీసీ కాలువ వెంట వెళ్లాడు. మద్యం మత్తులోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తమ్ముడు అందనం సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేశామన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.  


Updated Date - 2022-01-24T04:15:59+05:30 IST