మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి..?
ABN , First Publish Date - 2021-10-17T06:16:05+05:30 IST
మండలంలోని ఉడుములపాడు గ్రామ సమీపంలో ఉన్న పెద్దబాయిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి దూకి మృతి చెందినట్లు ఉడుములపాడు గ్రామస్థులు తెలుపుతున్నారు.
డోన్(రూరల్), అక్టోబరు 16: మండలంలోని ఉడుములపాడు గ్రామ సమీపంలో ఉన్న పెద్దబాయిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి దూకి మృతి చెందినట్లు ఉడుములపాడు గ్రామస్థులు తెలుపుతున్నారు. మృతుడు డోన్ పట్టణం పాతపేటకు చెందిన వ్యక్తి అని భావిస్తున్నారు. అయితే.. బావిలో మృతదేహం కోసం గాలింపుల చర్యలకు అధికారులు ప్రయత్నించగా.. రాత్రి చీకటిపడడంతో గాలింపు చర్యలను ఆదివారం ఉదయానికి వాయిదా వేసుకున్నారు. బావిలో మృతదేహం లభించేంత వరకు ఏమీ చెప్పలేమని పట్టణ పోలీసులు విలేకరులకు సమాధానమిచ్చారు.