గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-25T04:45:07+05:30 IST
గుర్తు తెలియని వాహనం ఢీకొని కారంచేడుకు చెందిన మాగులూరి శ్రీనివాసరావు(56) దుర్మరణం చెందాడు. ఈ సంఘ టన ఆదివారం పర్చూరు - చిలకలూరిపేట రహదారిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
పర్చూరు, అక్టోబరు 24: గుర్తు తెలియని వాహనం ఢీకొని కారంచేడుకు చెందిన మాగులూరి శ్రీనివాసరావు(56) దుర్మరణం చెందాడు. ఈ సంఘ టన ఆదివారం పర్చూరు - చిలకలూరిపేట రహదారిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ప ర్చూరు మండల పరిధిలోని తిమ్మరాజుపాలెం గ్రామ సమీపంలో వ్యవసా య పనులు చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్కు భోజనం ఇచ్చేందుకు ద్విచక్ర వాహ నంపై శ్రీనివాసరావు వెళుతున్నాడు. ఈ సమయంలో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో తలకు బలమై న గాయమైంది. సమీపంలో వాహనదారులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పర్చూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కరీమ్ తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.