ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న తెలుగువాళ్లు
ABN , First Publish Date - 2021-08-18T13:34:32+05:30 IST
తాలిబన్ల ఆక్రమణకు గురైన ఆఫ్టాన్లో అనేక మంది తెలుగువాళ్లు చిక్కుకుపోయారు.
మంచిర్యాల: తాలిబన్ల ఆక్రమణకు గురైన ఆఫ్ఘనిస్తాన్లో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. తెలంగాణవాసులు బొమ్మెన రాజన్న, వెంకటయ్య ఆఫ్ఘాన్లో చిక్కుకున్నారు. తమతో పాటు మరో 14 మంది భారతీయులు ఉన్నారని బాధితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి చేస్తున్నారు. బాధితుల్లో బొమ్మెన రాజన్న తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల వాసి. 8 ఏళ్లుగా కాబుల్లోని ఏసీసీఎల్లో రాజన్న పనిచేస్తున్నారు. జూన్లో ఇక్కడికి వచ్చిన రాజన్న తిరిగి ఈ నెల7న కాబుల్కు వెళ్లారు. కాగా తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.