మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
ABN , First Publish Date - 2021-07-14T15:38:21+05:30 IST
దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
హైదరాబాద్: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట రావుల రంజిత్ లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో రావుల రంజిత్తో డీజీపీ మీడియా ముందుకురానున్నారు.