మార్కెట్ యార్డు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-07-14T10:58:43+05:30 IST
వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల తర్వాత క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఆదోని(అగ్రికల్చర్), జూలై 13: వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల తర్వాత క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రైతులు పత్తి, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంట దిగుబడులను విక్రయానికి తెచ్చారు. సోమవారం పత్తి 1238 క్వింటాళ్లు రాగా కనిష్ఠంగా రూ.2829, గరిష్ఠంగా రూ.4659, వేరుశనగ 35 క్వింటాళ్లు రాగా కనిష్ఠంగా రూ.3386, గరిష్ఠంగా రూ.6079 పలికింది. ఆముదాలు 35 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ఠంగా రూ.3711, గరిష్ఠంగా రూ.3836 పలికాయి.