మాంసం దుకాణాలపై దాడులు

ABN , First Publish Date - 2020-04-06T10:18:50+05:30 IST

తూనికలు, కొలతలుశాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు, రేషన్‌ డిపోలు, రైతు బజార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

మాంసం దుకాణాలపై దాడులు

తూకంలో తేడాలుండడంతో తొమ్మిది మందిపై కేసులు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5, (ఆంధ్రజ్యోతి) : తూనికలు, కొలతలుశాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు, రేషన్‌ డిపోలు, రైతు బజార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  వినియోగదారులను మోసం చేస్తూ విక్రయాలు సాగించినట్టు గుర్తించారు. కేజీకి  50 నుంచి 200 గ్రాముల వరకు మాంసాన్ని తక్కువగా విక్రయించిన 12 మంది దుకాణదారులపై  కేసులు నమోదు చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, నగర పరిధిలోని గాజువాక, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని 15 చోట్ల రేషన్‌ డిపోల్లో తనిఖీలు నిర్వహించారు. నాలుగు చోట్ల బియ్యం తూకంలో తేడాలుండడంతో కేసులు నమోదు చేశారు. కంట్రోలర్‌ లీగల్‌ మెట్రాలజీ కాంతారావు, డిప్యూటీ కంట్రోలర్‌ మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. 


మాంసం దుకాణాల్లో తనిఖీలు

అనకాపల్లి టౌన్‌: పట్టణంలోని మాంసం దుకాణాల్లో ఆదివారం తూనికలు- కొలతలశాఖ తనిఖీలు చేపట్టింది. కిలో మాంసానికి 200 గ్రాములు తేడాను గుర్తించిన అధికారులు  తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.  తూనికలు- కొలతలశాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పీవీ రంగారెడ్డి  ఇన్‌స్పెక్టర్‌ డి.భాస్కరరావు,  వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-06T10:18:50+05:30 IST