మంజీరా నది ప్రవాహం మధ్య చిక్కుకున్న జాలర్లు

ABN , First Publish Date - 2020-10-21T18:30:48+05:30 IST

మంజీరా నది ప్రవాహం మధ్య చిక్కుకున్న జాలర్లు

మంజీరా నది ప్రవాహం మధ్య చిక్కుకున్న జాలర్లు

మెదక్: మంజీరా నదిలో చిక్కుకున్న ఐదుగురిని వారం రోజుల క్రిందట హెలీకాఫ్టర్ సహాయంతో బయటకు తీసిన సంఘటన మరువక ముందే మరో నలుగురు జాలర్లు చిక్కుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం హనుమాన్ బండల వద్ద మంజీరానదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బండరాళ్లపై నిలబడి ఉన్నారు. నిన్న సాయంత్రానికి మంజీరా వరద ఉధృతి తగ్గడంతో నలుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అయితే సింగూరు నుంచి నీరు వదలడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొల్చారం మండలం కిష్టాపూర్ మెదక్ పట్టణానికి చెందిన నలుగురు మంజీరా నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారులు హనుమాన్‌బండల వద్దకు చేరుకున్నారు. మెదక్ సీఐ...బాధితులతో ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. సాయంత్రంలోగా ఒడ్డుకు తీసుకువస్తామని ఆయన అన్నారు. ఈలోగా ఆహారం అందించేందుకు యత్నిస్తున్నారు.  

Updated Date - 2020-10-21T18:30:48+05:30 IST