21న తిరుపతిలో మెగా రుణమేళా
ABN , First Publish Date - 2021-10-17T05:11:58+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన తిరుపతిలోని కేఎస్ఆర్ కల్యాణ మండపంలో మెగా రుణమేళా నిర్వహించనున్నట్లు లీడ్ డిస్ర్టిక్ట్ మేనేజర్ ఎం.శేషగిరిరావు తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 16: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన తిరుపతిలోని కేఎస్ఆర్ కల్యాణ మండపంలో మెగా రుణమేళా నిర్వహించనున్నట్లు లీడ్ డిస్ర్టిక్ట్ మేనేజర్ ఎం.శేషగిరిరావు తెలిపారు. లీడ్ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్ నేతృత్వంలో జరిగే రుణమేళాలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, రిజర్వు బ్యాంకు, నాబార్డు ప్రతినిధులతో పాటు కలెక్టర్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలకు రుణాలు తక్కువ వడ్డీకే అందిస్తామని ఎల్డీఎం చెప్పారు.