చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ.. బాలిక ముఖంపై ఆవు పేడ పూసి మరీ.. ఆ యువకులు చేసిన పని..

ABN , First Publish Date - 2022-03-18T01:42:00+05:30 IST

బాలికలపై ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. నమ్మించి నట్టేట ముంచుతున్న వారు కొందరైతే.. మరికొందరు అత్యాచారాలు చేసి మరీ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో..

చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ.. బాలిక ముఖంపై ఆవు పేడ పూసి మరీ.. ఆ యువకులు చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

బాలికలపై ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. నమ్మించి నట్టేట ముంచుతున్న వారు కొందరైతే.. మరికొందరు అత్యాచారాలు చేసి మరీ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలీని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటన సంచలనం కలిగించింది. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ ఓ బాలికపై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టి మొఖానికి ఆవు పేడ పూసి అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఆదివారం ఓ బాలిక తన ఇంటి పెరట్లో పనిలో నిమగ్నమై ఉంది. అదే సమయంలో నలుగురు యువకులు అక్కడికి వచ్చి, ఆమెపై రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై ఆవు పేడ పూసి మరీ పిడిగుద్దులు కురిపించారు. చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ దూషించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలిక కేకలు విని కుటుంబ సభ్యులంతా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. బాధిత బాలికపై జనవరి 26న నిందితుడు యోగేంద్ర యాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించిన కొడుకు.. ఓ రోజు అసలు నిజం తెలియడంతో..


ఆ సమయంలో యోగేంద్రపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసును వెనక్కు తీసుకోవాలంటూ.. అప్పటి నుంచి బాలికపై నిందితుడు ఒత్తిడి చేస్తున్నాడు. అయినా బాలిక కుటుంబ సభ్యులు కేసును వెనక్కు తీసుకోలేదు. దీంతో బాలికపై యోగేంద్ర కోపం పెంచుకున్నాడు. కేసును వెనక్కు తీసుకోవాలంటూ స్నేహితులతో కలిసి ఆదివారం దాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విచారించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, నిందితుడు యోగేంద్రను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..

Updated Date - 2022-03-18T01:42:00+05:30 IST