చెంగాళమ్మకు 108 క్షీర కలశాలతో అభిషేకం
ABN , First Publish Date - 2021-02-28T03:48:37+05:30 IST
సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లికి 108 కలశాలలోని క్షీరం తో అభిషేకం చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 27 : సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లికి 108 కలశాలలోని క్షీరం తో అభిషేకం చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఈ 108 క్షీర కలశాలను గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మణ్ణిని అభిషేకించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మహాచండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సూళ్లూరుపేటకు చెందిన చెరకుపల్లి రామకుమార్ - శ్రీలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఽపాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్, ముంగర అమరావతి, పరిచూరి శారద, తాటిపర్తి వాణి, పొన్నా నాగమ్మ, కామిరెడ్డి రేవతి, భక్తులు పాల్గొన్నారు.