విత్తన గణపతిని పూజిద్దాం : మంత్రి

ABN , First Publish Date - 2020-08-14T11:15:26+05:30 IST

ఈ వినాయక చవి తికి విత్తన గణపతిని పూజిద్ధామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

విత్తన గణపతిని పూజిద్దాం : మంత్రి

నిజామాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): ఈ వినాయక చవి తికి విత్తన గణపతిని పూజిద్ధామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారం భిం చిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం మంత్రి దంపతులకు వారి అధికారిక నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ  కో-ఫౌండర్‌ రాఘవ విత్తన గణపతిని అందజేశారు. ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండాలన్నా సీఎం కేసీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ సంకల్పాన్ని నెరవేరుద్దామని మంత్రి అన్నారు.

Updated Date - 2020-08-14T11:15:26+05:30 IST