సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్‌రావు హామీ

ABN , First Publish Date - 2021-01-18T05:37:50+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌ 111 డివిజన్‌లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు టీఆర్‌ఎస్‌ నాయకుడు వి.ఆదర్శరెడ్డి తెలిపారు.

సమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్‌రావు హామీ
వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

రామచంద్రాపురం, జనవరి 17: జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌ 111 డివిజన్‌లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు టీఆర్‌ఎస్‌ నాయకుడు వి.ఆదర్శరెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో డివిజన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి సహకరించాలని కోరుతూ కార్పొరేటర్‌ వి.సింధూ భర్త ఆదర్శరెడ్డి ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అరవ రామకృష్ణ, మోహన్‌గౌడ్‌, బూన్‌, ధర్మప్రకాష్‌ తదితరులతో కలిసి మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్‌రావు ఈ నెల 23న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆదర్శరెడ్డి వివరించారు.

Updated Date - 2021-01-18T05:37:50+05:30 IST