అభివృద్ధి, సంక్షేమం వేరు కాదు : మంత్రి తానేటి వనిత
ABN , First Publish Date - 2020-06-06T10:14:10+05:30 IST
అభివృద్ధి, సంక్షేమం వేరు కాదని, సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తానేటి వనిత
యలమంచిలి, జూన్ 5: అభివృద్ధి, సంక్షేమం వేరు కాదని, సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తానేటి వనిత తెలిపారు. కలగంపూడిలో శుక్ర వారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పథ కాలను అమలు చేస్తున్న సీఎం జగన్పై బురద జల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్ని స్తోందని ఆరోపించారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్ను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు డ్రామాలా డుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ టీడీపీ నాయ కులు ఎన్నో అభాండాలు వేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.