అంతు చిక్కని అదృశ్యాలు
ABN , First Publish Date - 2021-04-11T06:41:26+05:30 IST
గ్రేటర్లోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఎనిమిది మంది అ దృశ్యమయ్యారు.
వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు..
వేర్వేరుగా మరో ఐదుగురు
వనస్థలిపురం/నార్సింగ్/నేరేడ్మెట్/ ఆనంద్బాగ్, ఏఫ్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఎనిమిది మంది అ దృశ్యమయ్యారు. అందులో ముగ్గురు బాలికలు ఉన్నారు. నార్సింగ్ పరిధి లో ఇద్దరు, నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఇద్దరు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు కనిపించకుండా పోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఇంజాపూర్లో మహ్మద్ మిర్జాన్ అన్వర్, నస్రీన్లకు ముగ్గురు కుమార్తెలు మిర్జాన్ ఆయేషా(17), మిర్జాన్ ఆస్మా బేగ్(15), మిర్జాన్ అబేజ్ బేగ్ ఉన్నారు. వీరు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. బంధువుల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా, ఫలితం లేకపోవ డంతో తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసు లు ఇంటి సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా, ముగ్గురు బాలిక లు అదే రోజు రాత్రి 3 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లినట్లు గు ర్తించారు. కాగా, మహ్మద్ మిర్జాన్ అన్వర్ స్థానికంగా రమేష్ యువకుడిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు. తన పెద్ద కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
8 నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన కోటా రాజేశ్గౌడ్ (22) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 4 నుంచి కనిపించకుండా పోయాడు. సోదరుడు కోటా శంకర్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
8 మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధి ఆర్కేనగర్ నివాసి కేపీ అర వింద్(26) నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వివాహం విషయంలో సంప్రదించగా ఆమె కుటుంబం అంగీక రించలేదు. ఈ నెల 10న ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచిన తండ్రి ప్రేమ్నాథ్కు అరవింద్ కనిపించలేదు. సీసీ పుటేజీలు పరిశీలించగా, అర్ధరాత్రి లగేజీతో వెళ్లినట్లు కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
8 నేరేడ్మెట్ ఠాణా పరిధి శ్రీ సాయినగర్లో ఉండే ఎం.మధు (20) ఈ నెల 7నుంచి కనిపించడం లేదు. తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ నరసింహస్వామి తెలిపారు.
8 తిరుమలగిరి కానాజీగూడలో ఉండే ఎస్.పుష్పామాల(65) నర్సు గా రిటైర్డ్ అయ్యారు. ఈ నెల 2న భర్తతో గొడవపడి నేరేడ్మెట్ ఆర్కే పురంలోని సోదరికి ఇంటికి వెళ్లారు. ఈ నెల 4న తాను పని చేసిన ఆస్పత్రికి వెళ్లి, తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహస్వామి తెలిపారు.
ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యం
నార్సింగ్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ కుల్కచెర్ల ప్రాం తానికి చెందిన బంగారమ్మ అంజయ్య దంపతులు గండిపేటలో ఉంటున్నారు. వారి కుమార్తె దమయంతి (20) గిరద్వారి అపార్ట్మెంట్లోని బేబీకేర్ సెంటర్లో పనిచేస్తోంది. ఏప్రిల్ 9న విధులకు వెళ్లి, తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో తల్లిదండ్రులు బేబీకేర్ సెంటర్ ప్రతినిధులను సంప్రదించారు. శుక్రవారం ఆమె విధులకు రాలేదని సమాధానమిచ్చారు. తల్లిదండ్రులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.