ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి
ABN , First Publish Date - 2021-06-23T09:59:19+05:30 IST
జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న
మిజోరాం మంత్రి రాబర్ట్
గుహవటి, జూన్22: జనాభాను నియంత్రించడానికి అసోంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ఇద్దరు పిల్లలుచాలని ప్రచారం చేస్తున్న సమయంలో మిజోరాం క్రీడల శాఖా మంత్రి రాబర్డ్ రోమవియా మాత్రం తన నియోజకవర్గంలో అత్యధికమంది పిల్లలున్న కుటుంబానికి లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఐజ్వాల్ తూర్పు-2 నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మిజో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి ఫాదర్స్డే రోజు ఆదివారం ఈ ప్రకటన చేశారు.