ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-28T10:42:31+05:30 IST
దళిత ప్రజానీకం ఎక్కువగా నివశించే సంజీవనగర్, కృపానగర్, సంతోషనగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు నీటి
ప్రొద్దుటూరు క్రైం, మే 27 : దళిత ప్రజానీకం ఎక్కువగా నివశించే సంజీవనగర్, కృపానగర్, సంతోషనగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసి నీళ్లందిస్తానని ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. బుధవారం పురపాలక పరిధి సంజీవనగర్లో ఇదివరకే నిర్మించి ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి పై ప్రాంతాలకు నీటిసరఫరా చేసే వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చానని, ఆ హమీ మేరకు నీటి సరఫరాకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.రాధ, ఇంజనీరింగ్, వాటర్వర్క్స్ అధికారులు, వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.