పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుంది: బాలకృష్ణ
ABN , First Publish Date - 2021-03-05T18:02:18+05:30 IST
వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుందని అన్నారు.
అనంతపురం: వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచభూతాలను కూడా వైసీపీ అమ్మేస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని పార్టీ వైసీపీ అని యెద్దేవా చేశారు. కళాకారులను అడ్డుపెట్టుకొని తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇసుక కొరతతో కార్మికులంతా రోడ్డున పడ్డారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.