విపత్తును ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలి
ABN , First Publish Date - 2020-08-11T10:33:33+05:30 IST
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు అంద రూ సహకరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.
ఏరియా ఆస్పత్రిలో పర్మినెంట్
ఆక్సిజన్ సిస్టమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కందుకూరు, ఆగస్టు 10: కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు అంద రూ సహకరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఏరియా వైద్యశాలలో పర్మినెంట్ ఆక్సిజన్ సిస్టమ్ ని ఆయన ప్రారంభించారు. 20 బెడ్లకు ప్రత్యేకంగా పర్మినెంట్ ఆక్సి జన్ సిస్టమ్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా విపత్తుని ఎదుర్కొనేందుకు దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన సహాయనిధి నుంచి నిధులు వెచ్చించి ఈ సౌకర్యాన్ని అందు బాటులోకి తెచ్చినట్టు చెప్పారు.
20 బెడ్లకు శాశ్వతంగా ఆక్సిజన్ అందించే అవకాశం ఏర్పడినందున ప్రస్తుతం కరోనా పేషెంట్లకే గాక భవిష్యత్తులోను వైద్యసేవలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. ఈ సందర్భంగా రూ.55 వేలతో 500 మందికి సరిపడ కంచరగుం ట మాజీసర్పంచ్ కాపులూరి మురార్జీ సమకూర్చిన కరోనా చికిత్సలో ఉపయోగించే నాలుగు రకాల మందులను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైద్యులకు అందించారు. కార్యక్రమంలో హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ హరిత, డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.