వాడకపు చెరువు ఇళ్ల స్థలాలకు వద్దు..
ABN , First Publish Date - 2020-06-04T11:16:07+05:30 IST
ప్రజలు ఉపయోగించుకునే చెరువు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పూడ్చివేయడం తగదని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.
మహదేవపట్నంలో ఎమ్మెల్యే రామరాజు
రామచంద్రపురం (ఉండి), జూన్ 3 : ప్రజలు ఉపయోగించుకునే చెరువు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పూడ్చివేయడం తగదని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. మహదేవపట్నం పంచాయితీ పరిధిలోని రామచంద్రపురం చెరువును ఇళ్ల స్థలాల నిమిత్తం పూడిక పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రజలు ఎమ్మెల్యే రామరాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చెరువును పరిశీలించారు. అనంతరం ఆయన ఫోన్లో అధికారులతో మాట్లాడారు. ప్రజలు చెరువును వినియోగించుకుంటున్నారని, ఇళ్ల స్థలాలకు తీసుకోవద్దని రెవెన్యూ అధికారులకు సూచించారు.ఆయన వెంట గంధం శ్రీను(బుజ్జి), వనిమా శ్రీను, వత్సవాయి సుజాత, వేగేశ్న సూర్యనారాయణరాజు తదితరులు ఉన్నారు.