బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నేడు
ABN , First Publish Date - 2020-04-06T10:19:47+05:30 IST
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమ వారం పలు సేవా కార్యక్రమాలు చేపడు తున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సే పీవీఎన్ మాధవ్
పెదవాల్తేరు: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమ వారం పలు సేవా కార్యక్రమాలు చేపడు తున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై కులమతాలకు అతీతంగా సమష్టిగా పోరాడాలన్నారు. విశాఖను రెడ్ జోన్గా ప్రకటించడం బాధాకరమని, మూడు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం శోచనీయమన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ నేతలు నగదు పంపిణీ చేయడం నీతిబాహ్యమైన చర్యగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.