తొలి మోడల్‌ హౌస్‌కు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-06-24T04:16:32+05:30 IST

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో తొలి మోడల్‌ హౌస్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభోత్సవం చేశారు

తొలి మోడల్‌ హౌస్‌కు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం
మోడల్‌ హౌస్‌ను ప్రారంభోత్సవం చేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న

ఇందుకూరుపేట, జూన్‌ 23 : పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో తొలి మోడల్‌ హౌస్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో తొలి ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురుల చేత గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాకినాడలో తొలి ఇళ్లు కాగా, రెండవ ఇళ్లు ప్రారంభోత్సవం మనం చేసుకోవటం అందరికీ ఆదర్శనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పేరు ప్రస్తావించేందుకు, ఆయనను విమర్శించేందుకు అర్హత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అనంతరం హౌసింగ్‌ ఈఈ నరసింహ రామ్మూర్తి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి 20 ట్రక్కుల ఇసుక ఉచితంగా ప్రభుత్వం అందజేస్తోందన్నారు.  అలాగే సిమెంట్‌, స్టీలు కూడా ధరల తగ్గింపుతో ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, సెంట్రల్‌ బ్యాంకు అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, యాదవ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, దువ్వూరు కళ్యాణరెడ్డి, కైలాసం శ్రీనివాసులురెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:16:32+05:30 IST