మెట్రోలో కోతి స్పెషల్ షో... వినోదం చూసిన ప్రయాణికులు!
ABN , First Publish Date - 2021-06-20T15:39:48+05:30 IST
ఢిల్లీ మెట్రోలో ఒక కోతి దర్జాగా సీటులో కూర్చుని...
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఒక కోతి దర్జాగా సీటులో కూర్చుని ప్రయాణించడాన్ని చూసిన ప్రయాణికులు తెగ ఆశ్చర్యపోయారు. ఆ కోతి యజమాని కూడా దాని పక్కనే కూర్చున్నాడు. ఆ కోతి కొద్దిసేపు ఆ బోగీలో తనకు వచ్చిన విన్యాసాలన్నింటినీ ప్రదర్శించింది. దాని చేష్టలను కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో వీడియోతీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన మెట్రోలోని బ్లూలైన్లో చోటు చేసుకుంది.