హోమ్ ఐసోలేషన్‌లో కోలుకున్న 50శాతం కరోనా బాధితులు!

ABN , First Publish Date - 2020-09-26T12:47:17+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే రికవరీ అయ్యారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం మే మొదటివారం నుంచి సెప్టెంబరు 23 వరకూ ఢిల్లీలో 1,34,133 మందిలో...

హోమ్ ఐసోలేషన్‌లో కోలుకున్న 50శాతం కరోనా బాధితులు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే రికవరీ అయ్యారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం మే మొదటివారం నుంచి సెప్టెంబరు 23 వరకూ ఢిల్లీలో 1,34,133 మందిలో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయి. వీరిలో 1,13,374 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ బాధితుల విషయంలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేశారు.


ఢిల్లీ ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందారు. కాగా ఢిల్లీ మహానగరంలో మొత్తం 2,62,450 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 30,867 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో కొత్తగా 3,827 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 24 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,147కు చేరింది.


Updated Date - 2020-09-26T12:47:17+05:30 IST