భర్త పోయాడన్న బాధతో కాదు.. కూతుళ్లకు ఆ తల్లి ఎందుకు విషమిచ్చిందో తెలిస్తే ఛీ కొడతారు..!

ABN , First Publish Date - 2021-07-17T18:09:58+05:30 IST

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గౌరవ్ అనే వ్యక్తి గత నెల 15న చనిపోయాడు..

భర్త పోయాడన్న బాధతో కాదు.. కూతుళ్లకు ఆ తల్లి ఎందుకు విషమిచ్చిందో తెలిస్తే ఛీ కొడతారు..!

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గౌరవ్ అనే వ్యక్తి గత నెల 15న చనిపోయాడు.. ఈ నెల 15న ఆయన ఇద్దరు పిల్లలూ అత్యంత విషమ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో చేరారు.. తండ్రి చనిపోయాడనే బాధతో వారిద్దరూ విషం తాగేశారని తల్లి చెప్పింది.. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు చనిపోగా, మరొక బాలిక బతికింది.. ఆ బాలిక చెప్పిన విషయం అందరికీ షాకిచ్చింది.. తల్లే తమకు విషం పెట్టిందని ఆ చిన్నారి పోలీసులకు చెప్పింది.. పిల్లల పేర బ్యాంకులో ఉన్న డబ్బు వస్తుందనే ఆశతో తల్లే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది. దీంతో పోలీసులు సదరు మహిళపై మర్డర్ కేసు నమోదు చేశారు. 


జలంధర్‌కు చెందిన గౌరవ్ గత నెల 15న చనిపోవడంతో అతడి పేరున 11 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. అయితే ఆ డబ్బులు నేరుగా అతడి భార్య హీనాకు ఇవ్వకుండా పిల్లలు అలీషా, అయత్ పేర్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు గౌరవ్ కుటుంబ సభ్యులు. ఆ డబ్బులు తనకు నేరుగా రాకపోవడంతో హీనా ఆగ్రహానికి గురైంది. పిల్లలను చంపేస్తే ఆ డబ్బులు తనకు దక్కుతాయని కుట్ర పన్నింది. ఈ నెల 15న వారిద్దరికీ విషం ఇచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఇద్దరినీ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. 


వారంతట వారే విషం తిన్నారని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పింది. అయత్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ చనిపోగా, అలీషా బతికింది. ఆ చిన్నారిని పోలీసులు ప్రశ్నించగా.. తల్లే మాత్ర అని చెప్పి విషం తినిపించిందని చెప్పింది. దీంతో పోలీసులు హీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. అమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-17T18:09:58+05:30 IST