పర్యాటకుల కారులోని నగలు, నగదు, సెల్ఫోన్లు చోరీ
ABN , First Publish Date - 2021-01-21T06:17:26+05:30 IST
చింతూరు మండలం మోతుగూడెం పర్యాటక ప్రదేశం పొల్లూరు జలపాతాల వద్ద పర్యాటకుల కారులో నగలు, నగదు, సెల్ఫోన్లను అపహరించారు.
మోతుగూడెం, జనవరి 20: చింతూరు మండలం మోతుగూడెం పర్యాటక ప్రదేశం పొల్లూరు జలపాతాల వద్ద పర్యాటకుల కారులో నగలు, నగదు, సెల్ఫోన్లను అపహరించారు. పశ్చమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన భోగ్యం హేమ సుందరం అనే వ్యక్తి బంధువులను తీసుకొని చింతూరు మండలం మోతుగూడెం వద్ద ఉన్న జలపాతాల వద్దకు వచ్చాడు. కారులో 46 వేల నగదు, మూడున్నర కాసుల బంగారం, ఐదు మొబైల్ ఫోన్లు ఉంచి లాక్ చేసి వారంతా జలపాతాల వీక్షణకు వెళ్లారు. అది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న నగలు, మొబైల్ ఫోన్లు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు మోతుగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.