ప్రభుత్వ ఆస్పత్రికి ఆక్సిజన్ తయారీ యంత్రాలు అందజేత
ABN , First Publish Date - 2021-05-18T06:07:14+05:30 IST
నరసరావుపేట లింగంగుంట్లలోని ప్రభుత్వం కొవిడ్ ఆస్పత్రికి ఆక్సిజన్ తయారు చేసే 10 యంత్రాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం అందజేశారు.
నరసరావుపేట, మే 17 : నరసరావుపేట లింగంగుంట్లలోని ప్రభుత్వం కొవిడ్ ఆస్పత్రికి ఆక్సిజన్ తయారు చేసే 10 యంత్రాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం అందజేశారు. రూ.15 లక్షల విలువ చేసే ఈ యంత్రాలను గ్రీన్ కో సంస్థ నిర్వాహకులు చలమలశెట్టి అనిల్ విరాళంగా అందించారు. తన అభ్యర్ధన మేరకు వీటిని విరాళంగా అందించిన గ్రీన్ కో సంస్థను అభినందిస్తున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దాతల సహకారంతో ఆక్సిజన్ యంత్రాలను ప్రభుత్వం ఆస్పత్రులకు అందజేయనున్న ట్టు చెప్పారు. కరోనా ఆస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరుస్తూ, మందులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అమెరికాకు చెందిన స్వచ్చంద సేవా సంస్థ ఈ ఆస్పత్రికి 30 పడకలు విరాళంగా అందించనున్నదని చెప్పారు. ఆస్పత్రికి అవసరం మేర వైద్యులు, సిబ్బందిని నియమించాలని సబ్ కలెక్టర్ను ఆయన ఆదేశించారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అవకతవకలు జరిగినా క్షమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్యెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ తదితరులు పాల్గొన్నారు.