ఇక ఎప్పుడూ బీజేపీ వైపు చూడను : ముకుల్ రాయ్

ABN , First Publish Date - 2021-06-11T23:20:49+05:30 IST

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీలో ఎవరూ ఉండలేరని, అందుకే తాను తిరిగి సొంత గూటికి వచ్చేశానని

ఇక ఎప్పుడూ బీజేపీ వైపు చూడను : ముకుల్ రాయ్

కోల్‌కతా :  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీలో ఎవరూ ఉండలేరని, అందుకే తాను తిరిగి సొంత గూటికి వచ్చేశానని టీఎంసీ నేత ముకుల్ రాయ్ పేర్కొన్నారు. ‘‘తిరిగి సొంత గూటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగాల్ తిరిగి పునర్ వైభవాన్ని పొందుతుంది. మమత నాయకత్వాన్ని నేను పూర్తిగా బలపరుస్తా. ఇక ఎప్పటికీ బీజేపీ వైపు వెళ్లను’’ అని ముకుల్ రాయ్ తేల్చి చెప్పారు. బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన తృణమూల్‌లో చేరారు.

Updated Date - 2021-06-11T23:20:49+05:30 IST