ములాయం నైట్ సఫారీకి ఇచ్చిన భూమిలో యోగి ఫిల్మ్ సిటీ?
ABN , First Publish Date - 2020-09-22T20:53:05+05:30 IST
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఫిల్మ్ సిటీ ...
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఎంపికైన మూడు స్థలాల్లో గ్రేటర్ నోయిడాలోని నైట్ సఫారీ స్థలం చోటు సంపాదించింది. 2005లో ఈ స్థలాన్ని నాటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నైట్ సఫారీ కోసం కేటాయించారు. గౌతమ బుద్ధ యూనివర్సిటీకి సమీపంలోని ముర్షద్పూర్ గ్రామంలోని ఈ ప్రాంతాన్నే సీఎం యోగి ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్దదైన, అత్యంత సుందరమైన ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని సీఎం యోగి గతవారంలో ప్రకటించారు. కాగా ఫిల్మ్ సిటీ కోసం ఎంపికైన మిగతా రెండు స్థలాల్లో యమునా ఎక్స్ప్రెస్ వే ప్రాంతంలోని సెక్టార్ 21 కూడా ఉంది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ఇక మరో స్థలం నోయిడాలోని నాలుగు వేర్వేరు సెక్టార్లలో ఉంది.