పీఎం సహాయనిధికి పలువురి విరాళం
ABN , First Publish Date - 2020-04-04T11:20:11+05:30 IST
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేం దుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు
పెద్దబజార్, ఏప్రిల్ 3: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేం దుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రతీ బీజేపీ కార్యకర్త కనీసం వంద రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధి కి విరాళాలు పంపి మరో పదిమంది విరాళాలు పంపే విధంగా ప్రోత్సహించాలని ఇచ్చిన పిలుపు మేరకు నగర బీజేపీ కార్పొరేటర్లు పీఎం సహాయనిధికి అందించాలని కోరుతూ లక్ష రూపాయల చెక్కును తమ వంతుగా బీజేపీ కార్యాలయంలో అందించారని బస్వా ల క్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. తన నిధుల నుంచి 1.26 కోట్లు విరాళం అందజేసిన ఎంపీ అ ర్వింద్ బాటలో కార్పొరేటర్లు నడవడం అభినందనీయమన్నారు. బీజేపీ ఫ్లోర్లీడర్ స్రవం తిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్లీడర్ న్యాలం రాజు, విప్ ప్రమోద్కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వినయ్రెడ్డి రూ.51 వేల విరాళం
ఆర్మూర్: కరోనా వైరస్ నివారణకు పీఎం కేర్స్ ఫండ్కు బీజేపీ ఆర్మూర్ నియోజక వర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి రూ.51 వేలు విరాళం అందజేశారు. పీఎం కేర్స్ అకౌంట్లో శుక్రవారం ఈ మొత్తాన్ని జమ చేశారు. అలాగే ఆర్మూర్కు చెందిన బీజేపీ కౌన్సిలర్ జీవీ.నరసింహారెడ్డి రూ.2,500 పీఎం కేర్స్ అకౌంట్లో జమ చేశారు.
ఆర్మూర్ రూరల్: ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పీఎం సహాయ నిధికి శుక్రవారం విరాళాలు అందజేశారు. మంథని గ్రామస్థులు రూ.65 వేలు, గోవిం ద్పేట్ గ్రామానికి చెందిన పలువురు యువకులు రూ.40వేల 299లు పీఎం సహా యనిధికి పంపించారు. కరోనా వైరస్ నేపథ్యంలో తమ వంతు విరాళాలను పీఎం సహాయనిధికి పంపినట్టు గోవింద్పేట్ ఎంపీటీసీ రాజ్కుమార్ తెలిపారు.