ప్లాట్‌ కొనిస్తానని చెప్పి.. తల్లీకూతుళ్లను నమ్మించి..

ABN , First Publish Date - 2020-08-12T13:01:09+05:30 IST

ప్లాట్‌ కొనిస్తానని చెప్పి తల్లీకూతుళ్లను నమ్మించి..

ప్లాట్‌ కొనిస్తానని చెప్పి.. తల్లీకూతుళ్లను నమ్మించి..

తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): ప్లాట్‌ కొనిస్తానని చెప్పి తల్లీకూతుళ్లను నమ్మించి రూ.30 లక్షల వరకు కాజేసిన ఓ వ్యక్తిని కంచరపాలెం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మురళీనగర్‌లో లక్ష్మి అనే మహిళ కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త చనిపోవడంతో ఇంటివద్దనే ఉంటూ కుట్టుమిషన్‌ పెట్టుకుని చీరల వ్యాపారం, చీటీలు, ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు కుమార్తె చేదోడుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో లక్ష్మి కుమార్తెతో సుజాతనగర్‌కు చెందిన నాగచలపతిరావు పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత లక్ష్మితో కూడా చనువు పెంచుకుని ఇద్దర్నీ శారీరకంగా ఉపయోగించుకున్నాడు.


ప్లాట్‌ కొనిస్తానని వారినుంచి రూ.30 లక్షల వరకు తీసుకున్నాడు. డబ్బుల గురించి అతనిని పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. పైగా వారిద్దరినీ బెదిరిస్తున్నాడు. మోసపోయామని గుర్తించిన లక్ష్మి గత నెల 23వ తేదీన కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి చలపతిరావును అరెస్ట్‌ చేశారు.


Updated Date - 2020-08-12T13:01:09+05:30 IST