ఫారెస్ట్ గార్డ్పై హత్య కేసు
ABN , First Publish Date - 2021-05-17T05:48:27+05:30 IST
ఫారెస్టు గార్డు కొట్టడంతో ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని మంచికల్లుకు చెందిన కొమరిగిరి వందనం(45) మృతి చెందాడు.
దాడితో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
రెంటచింతల, మే 16: ఫారెస్టు గార్డు కొట్టడంతో ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని మంచికల్లుకు చెందిన కొమరిగిరి వందనం(45) మృతి చెందాడు. ఈ క్రమంలో ఫారెస్టు గార్డు సురేష్బాబుతోపాటు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఆదివారం గురజాల డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న వందనంపై గార్డు కర్రతో దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన వందనం 11వ తేదీన పురుగుమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం. సమావేశంలో ఎస్ఐ చల్లా సురేష్ పాల్గొన్నారు.