త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-05-24T02:40:54+05:30 IST

బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీపీ ఆప్క గజ్జారాం యాదవ్‌ తెలిపారు. ఆదివారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదన్‌పూర్‌ గ్రామం నుంచి అంబుగాం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో భాగంగా ఈ నిర్మా ణం చేపట్టినట్లు చెప్పారు. వర్షాకాలం సమీస్తుండడం, ఇక్కడి గ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉండడం మూలంగా రైతులు వి త్తనాలు, ఎరువులు గ్రామానికి తీసుకెళ్లాలంటే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మూలంగా ఎడ్లబండ్లు సైతం నడవలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎరువుల బస్తాలను తరలించాలంటే అంబుగం ఎత్తయిన గుట్ట ప్రదే శం కావడంతో ఇబ్బంది కరంగానే ఉంటుందని పేర్కొన్నారు.

త్వరగా పూర్తి చేయాలి

కుంటాల, మే 23 : బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీపీ  ఆప్క గజ్జారాం యాదవ్‌ తెలిపారు. ఆదివారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదన్‌పూర్‌ గ్రామం నుంచి అంబుగాం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో భాగంగా ఈ నిర్మా ణం చేపట్టినట్లు చెప్పారు. వర్షాకాలం సమీస్తుండడం, ఇక్కడి గ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉండడం మూలంగా రైతులు వి త్తనాలు, ఎరువులు గ్రామానికి తీసుకెళ్లాలంటే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మూలంగా ఎడ్లబండ్లు సైతం నడవలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎరువుల బస్తాలను తరలించాలంటే అంబుగం ఎత్తయిన గుట్ట ప్రదే శం కావడంతో ఇబ్బంది కరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కొద్దినెలల క్రితం మండలానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు సైతం రోడ్డు పను లపై వివరించడం జరిగిందని, గుత్తేదారు నిర్లక్ష్యం మూలంగా ఇక్కడి పనులకు రోడ్డు మరమ్మతులు సక్రమంగా కొనసాగడం లేదని పేర్కొ న్నారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 


Updated Date - 2021-05-24T02:40:54+05:30 IST