మనోధైర్యంతో ఉండాలి: ఎమ్మెల్యే చిరుమర్తి
ABN , First Publish Date - 2021-05-18T07:04:45+05:30 IST
కొవిడ్ బాధితులు భయపడకుండా, మనోధైర్యంతో ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు.
రామన్నపేట, మే17: కొవిడ్ బాధితులు భయపడకుండా, మనోధైర్యంతో ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలు గా అండగా ఉంటుందని అన్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెస్టుల కోసం వచ్చే భాదితులకు మంచినీటి సదుపాయాలతో పాటు కావాల్సిన అన్ని వసతులనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో సదుపా యాలపై వాకబు చేశారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలితో నేరుగా ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా రోగుల సౌక ర్యార్థం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24బెడ్లను, 8ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసిందని, ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ గోదాసు శిరీష, ఎంపీటీసీ ఎండి.రేహాన్, ఆమేర్, యాసిన్, ఖమ్మంపల్లి శ్రీనివాస్, పాల్గొన్నారు.